EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి.

Image

కోదాడ, జూన్ 5. (నేటి తెలుగు పత్రిక) రెవిన్యూ గ్రామాలలో భూ భారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సులలో భూ సమస్యలపై స్వీకరిస్తున్న దరఖాస్తులను నిరంతర ప్రక్రియగా కొనసాగించి దరఖాస్తులను స్వీకరించాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ కోరారు.గురువారం మండలంలోని శ్రీరంగాపురం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడుతూ రెవిన్యూ సదస్సులలో కొందరు రైతులు సమయానికి దరఖాస్తులు ఇవ్వలేకపోయారని అలాంటి వారి కోసం రెవెన్యూ సదస్సులు పూర్తి చేసుకున్న గ్రామాలలోని రైతులు భూ సమస్యలపై ఇచ్చే దరఖాస్తులను స్వీకరించేందుకు మరో అవకాశం ఇవ్వాలని సిపిఎం మండల పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ సరిత కు వినతి పత్రం అందించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఏనుగుల వీరాంజనేయులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.