EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

Latest News

Image

COP 33 వేళ... పర్యావరణ పరిరక్షణలో.... భారత్ 'కపిరాజు'లా ఎదగాలి! - ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది - ప్రముఖ పర్యావరణ వాది, విద్యావేత్త డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి. వాషింగ్టన్ డీసీ నుంచి అందిన సమాచారం మేరకు... దక్షిణాది న్యూస్ : 2028లో ప్రతిష్టాత్మక COP 33 పర్యావరణ సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, దేశంలో పర్యావరణ ఉద్యమం వేగం పుంజుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ విద్యావేత్త, "ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్" జాతీయ సలహాదారులు డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను పరిశీలించిన ఆయన, పచ్చదనం పరిరక్షణ, నిర్వహణ పట్ల అమెరికా లాంటి దేశాలు చూపుతున్న నిబద్ధత తనను మంత్రముగ్ధుణ్ణి చేసిందని వెల్లడించారు. "కపిరాజు" లక్ష్యాన్ని అందుకోవాలి: ప్రధాని మోడీ ప్రకటించిన COP 33 సదస్సుకు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ సదస్సు కేవలం మొక్కుబడిగా నిర్వహించే కార్యక్రమం కాకూడదు. "ప్రపంచ దేశాలకు ఒక నమూనాలా ఉండాలి. అప్పటికి మన దేశం పర్యావరణ పరిరక్షణలో సాధించిన విజయాలు, శ్రీకృష్ణుడు సారథ్యం వహించిన రథంపై రెపరెపలాడిన జెండాపై కపిరాజులా అద్భుత ప్రగతి సాధించి ఉండాలి," అని డాక్టర్ గోపాల్ రెడ్డి ఉద్ఘాటించారు. కేవలం 'మన వంతుగా ఏదో చేశాం' అన్నట్లుగా వ్యవహరిస్తే అది భారతీయ కీర్తికి భంగం కలిగిస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలి: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యం సమస్యపై ప్రతి దేశం, ప్రతి వ్యక్తి బాధ్యత తీసుకోవాల్సిన సమయం ఇది. అమెరికా వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ పట్ల ఒక స్పష్టమైన విధానంతో ముందుకు సాగుతున్నాయని, భారతదేశంలోనూ ఆ వేగం, ఆ స్పృహ ప్రజల్లో అలవర్చుకోవాలని ఆయన ఆకాంక్షించారు. COP 33కు సమయం దగ్గరపడుతున్నా, జనంలో ఈ కార్యక్రమం పట్ల ఇంకా పూర్తిస్థాయిలో అవగాహన, ఉద్యమ స్పృహ కనిపించడం లేదనేది డాక్టర్ గోపాల్ రెడ్డి అభిప్రాయం. పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి, సదస్సు నాటికి భారత్‌ను పర్యావరణ ప్రగతిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.