EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

Breaking News

*హ‌ర్ దిల్ తిరంగా హ‌ర్ ఘ‌ర్ తిరంగా* - *దేశభ‌క్తిని చాటిచెప్పేలా మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లు* - *ప్ర‌తి గుండె ఉప్పొంగేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాలు* - *ఉత్సాహంగా పంద్రాగ‌స్టు వేడుక‌ల‌కు స‌న్న‌ద్ధం* - *స‌రిహ‌ద్దులో మ‌న వీర సైనికుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయం* - *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌* ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రతినిధి, ఆగస్టు 11 (దక్షిణాది న్యూస్) ప్ర‌తి మ‌దిలో ప్ర‌తి ఇంటిపైనా దేశ‌భ‌క్తిని చాటిచెప్పేలా మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లా డుతోంద‌ని. ప్ర‌తి గుండె ఉప్పొంగేలా హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ పంద్రాగ‌స్టు వేడుకుల‌కు సిద్ధ‌మ‌వుతున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ అన్నారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మం లో భాగంగా సోమ‌వారం విజ‌య‌వాడ ఓల్డ్ జీజీహెచ్ వ‌ద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీలో విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, రెవెన్యూ, పోలీస్‌, యువజ‌న సంక్షేమం, వైద్య ఆరోగ్యం త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, సిబ్బందితో పాటు వాక‌ర్స్ క్ల‌బ్ వంటి వివిధ అసోసియేష‌న్ల నుంచి పెద్దఎత్తున ప్ర‌తినిధులు, వివిధ క‌ళాశాల‌ల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచారు. త్రివ‌ర్ణ‌ప‌తాకాలు చేత‌బూని భార‌త్ మాతాకీ జై, వందేమాత‌రం నినాదాల‌తో తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య కళాక్షేత్రం, ఓల్డ్ జీజీహెచ్ ర‌హ‌దారులుమార్మోగిపోయాయిఅమ‌ర‌వీరుల బ‌లిదానం. నేటి స్వేచ్ఛా భార‌తం, త్రివ‌ర్ణ ప‌తాకం ఐక‌మత్యానికి సంకేతం నినాదా ల‌తో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ స‌రిహ‌ద్దు ల్లో మ‌న వీర సైనికుల త్యాగాలు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని. ఆప‌రేష‌న్ సిందూర్ మ‌న దేశ స‌త్తాను చాటిచెప్పింద‌ని పేర్కొన్నారు. ఏదో ఒక రోజుకి ప‌రిమితం కాకుండా ప్ర‌తి హృద‌య‌మూ త్రివ‌ర్ణ ప‌తాక ఐక్య‌తా స్ఫూర్తిని నింపుకొని ప్ర‌తిరోజూ ముంద‌డుగు వేయాల‌ని, ప్ర‌తిఒక్క‌రూ దేశ స‌మ‌గ్రాభివృద్ధి లో కీలక భాగ‌స్వాములు కావాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పిలుపు నిచ్చారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా వంటి గొప్ప కార్య‌క్ర‌మాల్లో భాగ‌స్వాముల‌ను చేస్తున్నందు కు ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ ట్లు పేర్కొన్నారు.*ఈ స్వేచ్ఛ‌ ఎంద‌రో మ‌హ‌నీయుల త్యాగ ఫ‌లితం: సీపీ ఎస్‌వీ రాజశేఖ‌ర‌బాబు* మ‌నం నేడు అనుభ‌విస్తున్న ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంద‌రో మ‌హ‌నీయుల త్యాగ ఫ‌లిత‌ మ‌ని. మ‌న‌కు స్వాతంత్య్రం వ‌చ్చాక ఎన్నో రంగాల్లో ముందుకెళ్లామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజశేఖ‌ర‌ బాబు అన్నారు. దేశమంటే మాతృమూర్తితో స‌మాన‌మ‌ని. దేశభ‌క్తితో దేశాభివృద్ధికీ ప్ర‌తిఒక్క‌రూ స‌మ‌ష్టిగా ముంద‌ డుగు వేయాల్సిన అవ‌స‌ర‌ముం ద‌ని పేర్కొన్నారు. మ‌హ‌నీయుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ, వారి స్ఫూర్తితో ప్ర‌గ‌తి ప‌థంలో వ‌డివ‌డిగా ముంద‌డుగు వేసేందుకు ఇలాంటి కార్య‌క్ర‌మా లు దోహ‌దం చేస్తాయ‌ని రాజ‌ శేఖ‌ర‌బాబు అన్నారు. కార్య‌క్ర‌మంలో సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ ఆర్‌.మ‌ల్లికార్జున‌రావు, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర హెచ్ఎం, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, జిల్లా యువ‌జ‌న సంక్షేమ అధికారి యు.శ్రీనివాస‌ రావు, వీఎంసీ అద‌న‌పు క‌మిష‌ న‌ర్ డా.డి.చంద్ర‌శేఖ‌ర్‌, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని, జిల్లా క్రీడ‌ల అభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్‌, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్ డా.కె.ర‌మేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement Image
View The Website