అద్దంకి : జర్నలిస్ట్ లకు సమాచార హక్కు చట్టం ఒక గొప్ప ఆయుధం అని రాష్ట్ర ముఖ్య సమాచార కమీషనర్ ఆర్. ఎమ్.బాషా అన్నారు.శనివారం నాడు ఆయన అద్దంకిలో పర్యటించారు.ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో స్థానిక విలేకరులతో ఆయన ముచ్చటించారు. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తెలుసుకుని,దానిని తమ తమ పత్రికలలో ప్రచురించడం ద్వారా ప్రజలకు ఎనలేని సేవ చేయవచ్చునని ఆయన సూచించారు.తాను కూడా 40 సంవత్సరాల పాటు వివిధ పత్రికల్లో పనిచేసినట్లు ఆర్.ఎం.బాష తెలిపారు.