EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

వచ్చేనెల 4న హైదరాబాద్‌కు లో అచ్యుత గోపి లైవ్​ కాన్సర్ట్ హైదరాబాద్‌లో వెల్లివిరియనున్న ఆధ్యాత్మిక శోభ‌

Image

హైదరాబాద్, సెప్టెంబర్ 21(దక్షిణాది న్యూస్) : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, గాయని అచ్యుత గోపి లైవ్ కాన్సర్ట్ లో పాల్గొననున్నారు వచ్చే నెల 4 తేదీన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్‌ లో జరిగే "అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్" ఆధ్యాత్మిక కార్యక్రమం లో అచ్యుత గోపి తన గాణామృతంతో ప్రేక్షకులను ఆధ్యాత్మికత భావన తో మంత్రముగ్ధులను చేయనున్నారు. అచ్యుత గోపి భారతదేశ యాత్ర సందర్భంగా తన అమృతగానంతో అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమంలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఈవెంట్ ఆధ్యాత్మికత, సంగీతం కలగలిసిన మరో మరపురాని అనుభవాన్ని అందించనుంది. అక్టోబర్ 4న జరిగే ఈ కాన్సర్ట్ టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా చల్‌మన్ వృందావన్ సంస్థ ఆధ్వర్యంలో రాధాకృష్ణ అకేషన్స్ సహకారంతో ఆదివారం నోవోటెల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అచ్యుత గోపి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సమావేశంలో అచ్యుత గోపి మాట్లాడుతూ.. భగవద్గీత, భాగవతం, భారత సంప్రదాయం, సంస్కృతి గొప్పదనం గురించి వివరించారు. తెలంగాణకు వచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. చల్మన్ వృందావన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేశారు. కృష్ణుడు ఎంచుకున్న ప్రజల మధ్య జీవిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన జీవితంలోకి వెలుగులు తెచ్చిన కృష్ణ, గోవింద అంటే ఎప్పటికీ తనకు అపార భక్తిభావం ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భక్తిభావం వెల్లివిరుస్తుందని, హైదరాబాద్లో కార్యక్రమం చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. రాధాకృష్ణుల జీవితంలోని గొప్ప విషయాలు, సందేశాలను అచ్యుత గోపి వివరించారు. మీరూ ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగం అవ్వాలంటే వెంటనే టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటో లో బుక్ చేసేయండి. ఈ కార్యక్రమంలో చల్‌మన్‌ వృందావన్‌ సంస్ధ స్థాపకురాలు రీతు భగవాన్‌, తదితరులు పాల్గొన్నారు.