EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. 'అడవితల్లి బాట' పేరుతో రూ.1005 కోట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 652 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షాలు, కొండల అడ్డంకులు ఉన్నా, పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

Image

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ‘స్త్రీ శక్తి’ పేరుతో ఫ్రీ బస్సు ప్రయాణ పథకాన్ని ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఐదు కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలవుతోందని తెలిపింది. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్లు తగిన గుర్తింపు కార్డుతో ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణించవచ్చిన పేర్కొంది.