EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

పర్యావరణాన్ని సమిష్టిగా కాపాడుకుందాం: ఎన్విరాన్మెంట్ ఆక్టివిస్ట్ పత్రిక నూతన సంచిక ఆవిష్కరణ

Image

విజయవాడ: పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెబుతూ, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన "ఎన్విరాన్మెంట్ ఆక్టివిస్ట్" అనే ప్రత్యేక పత్రికను ఆంధ్రప్రదేశ్ సర్వే ల్యాండ్స్ జాయింట్ డైరెక్టర్ సీ హెచ్ వీ ఎస్ ఎన్ కుమార్ ఆవిష్కరించారు. మంగళగిరి లోని సర్వే జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవడం అనేది కేవలం కొందరి బాధ్యత కాదని, ఇది మనందరి సమిష్టి కర్తవ్యమని పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, ఈ పత్రిక ప్రజల్లో చైతన్యం నింపడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ సమస్యలు, వాటి నివారణోపాయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ఈ పత్రిక దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్, ఈపీడీసీ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య, ఏపీ ఉపాధ్యక్షురాలు అన్నెం కుసుమ, శ్రీదేవి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. వారంతా మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు. "ఎన్విరాన్మెంట్ ఆక్టివిస్ట్" పత్రిక ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని వారు అభిప్రాయపడ్డారు. వరప్రసాద్ మాట్లాడుతూ.... పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని అన్నారు. రంగయ్య మాట్లాడుతూ.... పరిశ్రమలు మరియు ప్రజలు పర్యావరణహిత విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అన్నెం కుసుమ మరియు శ్రీదేవి రాజేశ్వరి మాట్లాడుతూ....మహిళలు కూడా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మొత్తానికి, "ఎన్విరాన్మెంట్ ఆక్టివిస్ట్" పత్రిక ఆవిష్కరణ పర్యావరణ పరిరక్షణపై ఒక సానుకూల చర్చకు దారితీసింది. ఈ పత్రిక రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందని ఆశిద్దాం.