EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

నాగపూర్: మహారాష్ట్రలో మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ సమాధి వివాదం ముదురుతోంది. నాగపూర్‌లో కొందరు అల్లరిమూకలు శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక వర్గం ఆస్తులపై తెగబడటం, పలు వాహనాలకు నిప్పుపెట్టడం తీవ్ర ఉద్రికతలు దారితీసింది. ఈ ఘటనలో 35 మందికి పైగా గాయపడగా, వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉండటంతో దీనిని మహారాష్ట్ర సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది.

Image

నాగపూర్: మహారాష్ట్రలో మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ సమాధి వివాదం ముదురుతోంది. నాగపూర్‌లో కొందరు అల్లరిమూకలు శుక్రవారం ప్రార్థనల అనంతరం ఒక వర్గం ఆస్తులపై తెగబడటం, పలు వాహనాలకు నిప్పుపెట్టడం తీవ్ర ఉద్రికతలు దారితీసింది. ఈ ఘటనలో 35 మందికి పైగా గాయపడగా, వీరిలో ఎక్కువ మంది పోలీసులే ఉండటంతో దీనిని మహారాష్ట్ర సర్కార్ తీవ్రంగా పరిగణిస్తోంది. హింసాకాండకు ప్రేరేపించినట్టుగా భావిస్తున్న స్థానిక నేత షాహిమ్ ఖాన్‌తో సహా 50 మందికి పైగా నిందితులను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాగపూర్ హింస, ఔరంగబేజు సమాధి వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కీలక వ్యాఖ్యలు చేసింది. ఔరంగజేబు సమాధి నేటి తరానికి అవసరం లేదని ఆర్ఎస్ఎస్ కీలక నేత సునీల్ అంబేకర్ అన్నారు. ఏ రకమైన హింస సమాజానికి మంచిది కాదని అన్నారు.