EPDC News India
EPDC News Logo

Environment Protection Development Council-EPDC

స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన శ్రీమతి అన్నా కొణిదల

Image

స్వామి వారి దర్శనానంతరం ఉదయం 10 గంటల సమయంలో శ్రీమతి అన్నా కొణిదల గారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కుమారుడు కొణిదల మార్క్ శంకర్ పేరిట రూ. 17 లక్షలు విరాళాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు అందించారు. అనంతరం నిత్యాన్నదాన సత్రంలో శ్రీవారి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు.