EPDC
EPDC Logo

Environment Protection Development Council

పర్యావరణ పరిరక్షణ సత్యనిష్టతో కూడిన కృషి: వర్ల రామయ్య

శ్రీ కనకదుర్గ టిఫిన్ సెంటర్: పర్యావరణహిత చర్యకు ప్రశంసలు

Image

విజయవాడ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి పెను ముప్పు కలిగిస్తున్న నేపథ్యంలో, శ్రీ కనకదుర్గ టిఫిన్ సెంటర్ యజమాని మున్నంగి ప్రభాకర్ రెడ్డి తీసుకున్న పర్యావరణహిత చర్యను ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ అభినందించింది. హోటల్ కు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఎకో ఫ్రెండ్లీ క్యారీ బ్యాగులను అందిస్తూ ప్రభాకర్ రెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గిద్దా శ్రీనివాసనాయుడు బుధవారం (ఏప్రిల్ 16) హోటల్ ను సందర్శించారు. ప్రభాకర్ రెడ్డి యొక్క చొరవను కొనియాడుతూ, వారికి కౌన్సిల్ తరపున "ఎన్విరాన్మెంట్ అక్తివిస్ట్" పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో గిద్దా శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, "మున్నంగి ప్రభాకర్ రెడ్డి గారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాన్ని గుర్తించి, పర్యావరణ అనుకూలమైన బ్యాగులను ఉచితంగా అందించడం అభినందనీయం. ఇది మిగిలిన వ్యాపారులకు కూడా స్ఫూర్తినిస్తుంది" అని అన్నారు. మరో విశేషం ఏమిటంటే, హోటల్ లో పనిచేస్తున్న వంట మాస్టర్లు బి. వెంకటేశ్వరరావు, రాజేష్ మరియు బాలు కూడా కస్టమర్లకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తున్నారు. వారి యొక్క ఈ అవగాహన మరియు సహకారం కూడా పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ కనకదుర్గ టిఫిన్ సెంటర్ యొక్క ఈ పర్యావరణహిత చర్యను పలువురు అభినందిస్తున్నారు. వినియోగదారులు కూడా ప్లాస్టిక్ కు బదులుగా ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ బ్యాగులను అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మున్నంగి ప్రభాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.